1, డిసెంబర్ 2022, గురువారం

పౌరహక్కుల బాల గో పాల్ కు బొగ్గు మనిషి పరిచయం -మునీర్

పౌరహక్కుల  బాల గో పాల్ కు బొగ్గు మనిషి  పరిచయం -మునీర్ 


**************************************************

ఆంధ్ర దేశం  లో పౌరహక్కుల ఉద్యమానికి ఒక తిరుగులేని చిరునామా బాలగోపాల్. అనారోగ్యము తో మరణించినప్పటికీ అతని సేవలను  సింగరేణి కార్మికులు ఎప్పటికి మర్చిపోలేరు . కోల్ బెల్ట్ లో అతనికి వెన్నుదన్నుగా నిలబడ్డ వారు ఎవరంటే మునీర్ పేరే ముందు వరుస లో ఉంటుంది . 

ఒక బలమైన పౌర హక్కుల ఉద్యమం సింగరేణి ప్రాంతం లో నిలదొక్కుకోవటానికి బాలగోపాల్ కృషి ఎంతో విలువైనది . అదే సమయం లో బాలగోపాల్ వ్యక్తిత్వం ,మనుషుల పట్ల ప్రేమ మునీర్ ని కదిలించింది . దాంతో అందరు భయపడడ్డా ,తనని భయపెట్టినా ..  అన్నింటికీ మునీర్ సిద్ధపడ్డాడు. 

ఎంతో సాదా సీదా ఉన్న బాలగోపాల్ ను చూసి నేను మొదట ఆశర్య పోయాను . అప్పటికే దేశ వ్యాప్తంగా ఆయన కున్న పేరుకు ,ఆయన వేష ధారణకు   అస్సలు సంభందం లేదు . ఒకరికి ఒకరు పరిచయాలు అయిన తర్వాత ఆయన సూటిగా తాను వచ్చిన పని ఏమిటో చెప్పుకొచ్చిండు . 

"కోల్ బెల్ట్  ప్రాంతం లో పోలీసులు కిడ్నాప్ చేసిన  పాల్గుణ,కుమార్,సమ్మయ్య మరియు రవి ల విషయమై పౌర హక్కుల సంఘం తరుపున విచారణ చేయటానికి వచ్చాను .  ఈ విచారణ లో మీరు మాకు సహకరిస్తారనే ఉద్దేశ్యం తో వచ్చాను .. మీరు కాదనుకుంటే స్పష్టంగా తెలియ చేయవచ్చు .. ఇందులో మొహమాటాలకు తావు లేదు . . 'అన్నాడు సూటిగా 

బాలగోపాల్ మాటల్లో నాన్చుడు వ్యవహారం ఉండదు .. ఏదైనా దాచుకోకుండా ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన నైజం .. 

నేను ఒక్క క్షణం తటపటాయించాను . కానీ అంతటి వ్యక్తి వచ్చి అణిచివేతకు , అన్యాయానికి గురయ్యే ప్రజల తరపున నేను ఉన్నాను అంటుంటే నేను నిలబడక పోవటం భావ్యం కాడనిపించింది . 

ఆయనే మళ్ళీ "మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మానుకోవచ్చు . ఇందులో బలవంతం ఏమి లేదు "

"ఆబ్బె !అటువంటిది ఎం లేదు సార్ .. మీరు మాకోసం వచ్చినప్పుడు మీకు సహకరించకపోవడం

అన్యాయం అవుతుంది "

అట్లా మొదలైన బాలగోపాల్  పరిచయం  అటు తరువాత ఈ ప్రాంతం లో చాలా ఎన్కౌంటర్ ల పై నిజనిర్ధారణ కు వచ్చినప్పుడు ఆయన నేరుగా మునీర్ ఇంటికే వచ్చేవాడు . ఆలా తరచుగా రావడం తో ఆ ఇంట్లో ఒకడుగా  కలిసిపోయాడు . 

సిర్పూర్ (టి ) ప్రాంతం లో ఒకసారి  ఎన్కౌంటర్ జరిగితే నిజనిర్ధారణ కు బాలగోపాల్ వచ్చాడు . 

మునీర్ తో  కలిసి  మందమర్రి నుంచి కాగజ్ నగర్ వరకు బస్సు లో వెళ్లారు . అక్కడి నుండి ఎన్కౌంటర్ స్థలం బె జ్జుర్ కి దూరం దాదాపు 15 కిలోమీటర్లు . ఆ మార్గం లో వాహనాల సౌకర్యం లేదు .అక్కడికి చేరుకోవాలంటే సైకిల్ ఒక్కటే దిక్కు . చివరికి సైకిల్ మీదే బాలగోపాల్ అక్కడికి వెళ్ళాడు . 

ఆ ఎన్కౌంటర్ లో చనిపోయింది కోల్బెర్ట్ ప్రాంతం లోప్రముఖ  ప్రజాగాయకుడుగా  పేరున్న 

సుధ (సుందిళ్ల ధర్మన్న )సొంత తమ్ముడు . ఆదిలాబాద్ రైతాంగ పోరాటం లో ఎదిగివచ్చిన అతన్ని ,ఇన్  ఫార్మర్ ఇచ్చిన సమాచారం తో పోలీసులు అతను ఉన్న ఇంటిని చుట్టుముట్టి ,లొంగ దీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎన్కౌంటర్ పేర కాల్చి చంపారు . 

నిజనిర్ధారణ లో బాలగోపాల్ ది ఒక విశిష్టమైన విచారణా పద్దతి .. చాలా సాదా సీదా గా ,సూటిగా ప్రజల స్థాయి కి వెళ్లి మాట్లాడుతాడు . ఎక్కడా అతి ఉండదు . ఆయనతో మాట్లాడిన వాళ్ళు ఎవరైనా మనసు విప్పి మాట్లాడవలిసిందే .. 

ఆయన మనుషుల్ని చాలా ప్రేమించేవాడు .. 

"ఇలా మనుషులందరినీ చంపుకుంటూ పోతే సమాజం ఏమి కావాలి ?

అందులో ప్రజలను రక్షించాల్సిన రాజ్యమే ఇట్లా అమానుషా లకు తెగబడితే ఎలా?

ఈ విధంగా మనుషులని పట్టుకొని చంపడం భారత్ రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్ధం .. అనేవాడు 

నేరం చేసిన వారిని చట్టప్రకారం శిక్షించాలి తప్ప ఎన్కౌంటర్ లు ప్రజాస్వామ్యం కాదు .